భారత రాజ్యాంగం
భారత రాజ్యాంగం
భారత రాజ్యాంగం
- రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును మొదటిసారిగా 1942 లో ప్రతిపాదించింది క్రిప్స్ మిషన్.
- రాజ్యాంగ పరిషత్ ఆవశ్యకతను గురించి మొదట చెప్పిన వ్యక్తి ఎం.ఎన్. రాయ్.
- క్యాబినెట్ మిషన్ సూచన మేరకు రాజ్యాంగ పరిషత్ను 1946 లో ఏర్పాటు చేశారు.
- రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు 1946 జులై నుంచి సెప్టెంబరు వరకు జరిగాయి.
- 1946, డిసెంబరు 9న రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం జరిగింది.
- మొదటి సమావేశానికి డాక్టర్ సచ్చిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించారు.
- 1946, డిసెంబరు 11న డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ రాజ్యాంగ పరిషత్తుకు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
- 1946, డిసెంబరు 13న జవహర్లాల్ నెహ్రూ లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
- లక్ష్యాల తీర్మానాన్ని 1947 జనవరి 22న ఆమోదించారు.
- 1947 జులై 22న జాతీయ పతాకాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది.
- రాజ్యాంగ ముసాయిదా కమిటీని 1947 ఆగస్టు 29న ఏర్పాటు చేశారు.
- 1949 నవంబరు 26న రాజ్యాంగాన్ని ఆమోదించారు.
- 1950 జనవరి 24న చివరిసారిగా సమావేశం జరిగింది. ఈ చివరి సమావేశంలోనే జాతీయ గీతం, జాతీయ గేయాలను ఆమోదించారు.
- 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
- రాజ్యాంగ పరిషత్తు ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలు, సంస్థానాలకు ప్రాతినిధ్యం కల్పించారు.
- రాష్ట్రాల విధాన సభల సభ్యులు ఓటు బదిలీ అనే పద్ధతి ద్వారా తమ ప్రతినిధులను ఎన్నుకున్నారు.
- మొత్తం సభ్యుల సంఖ్య 389.
- రాష్ట్రాల నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య 292.
- స్వదేశీ సంస్థానాల నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య 93.
- చీఫ్ కమిషనర్ ప్రాంతాల నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య 4.
- దేశ విభజన తర్వాత సభ్యుల సంఖ్య 299.
- 299 మందిలో ఎన్నికైన సభ్యులు 229, నామినేటెడ్ సభ్యులు 70.
- మొదటి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య 211.
- రాజ్యాంగ రచనకు పట్టిన సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు.
- సమావేశాలు నిర్వహించిన మొత్తం రోజులు 165.
- మొత్తం నిర్వహించిన సమావేశాలు 11.
- రాజ్యాంగ పరిశీలనకు పట్టిన సమయం 114 రోజులు.
- రాజ్యాంగ రచనకు అయిన మొత్తం ఖర్చు 64 లక్షలు.
- సంప్రదించిన రాజ్యాంగాలు 60.
- రాజ్యాంగ పరిషత్తులో మొత్తం మహిళా సభ్యులు 9 మంది.
- రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏనుగు.
- మౌలిక రాజ్యాంగంలో 395 ప్రకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్లు ఉన్నాయి.